Tuesday, March 11, 2025

వైఎస్ జగన్‍‌ కు 18 మంది డాక్టర్లతో పరీక్షలా?

వైఎస్ జగన్‍‌పై దాడిని ఖండించిన రఘురామ.. కానీ ఇది ఇంకో లెక్క!

ఏపీలో సీఎం జగన్ మీద దాడి వ్యవహారం రాజకీయంగా కాకరేపుతోంది. ఘటన వెనుక టీడీపీ శ్రేణుల హస్తం ఉందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే గతంలో కోడికత్తి లాగా ఇది కూడా డ్రామానేనంటూ టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీని వీడి టీడీపీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దీనిపై స్పందించారు. జగన్‌పై దాడిని ఖండిస్తున్నట్లు రఘురామ చెప్పుకొచ్చారు. అయితే ఘటనపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

” దాడి సమయంలో కరెంట్ తీసేశారు. కరెంట్ తీగలు తగులుతాయని దీపాలు ఆర్పేశారు. లైవ్ కూడా లేదు. జగన్‌కు చిన్న గీటు తగిలింది. రక్తమేమీ కారిపోలేదు. మామూలుగా ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా ఇలాంటి గీట్లు పడుతుంటాయి. కొంచెం పెద్దగానే తగిలింది అనుకున్నా.. ఇలాంటి గీటుకు ఎవరైనా కుట్లు వేస్తారా? కన్నుకు తగలలేదు. కణితికి తగలలేదు. ఎవడైనా కొట్టాడా లేదా గ్యాప్‌లో ఆయనే గీరుకున్నాడా? ఓ ఫోటోలో మామూలుగా ఉంది. మరో ఫోటోలో కన్ను చుట్టూ కమిలినట్లుగా ఉంది. అని రఘురామ అనుమానాలు వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img