డా. కేశవులు భాషవత్తిని. ఎండి. ఉస్మానియా. నిజామాబాద్ & హైదరాబాద్.
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్లో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే డబుల్ అయింది.. భారతదేశంలో యాక్టివ్ COVID-19 కేసుల సంఖ్య 2,710కి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు రోజుల క్రితం.. మే 29 కరోనా యాక్టివ్ కేసులు.. 1010 మాత్రమే ఉన్నాయి.. ఈ క్రమంలోనే.. కేసులు అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం 2710 కరోనావైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.. గత 24 గంటల్లో 511 కేసులు నమోదయ్యాయి. 255 మంది కోలుకోగా, ఏడుగురు మరణించారు. దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15 కి చేరుకుంది.. అందులో గరిష్టంగా 6 మరణాలు మహారాష్ట్రలో సంభవించాయి.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది..