తెలంగాణ టైమ్స్ డెస్క్ – హైదరాబాద్ :
పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ వెళ్లకుండా భారత్ లోనే ఉన్నవారిపై కఠిన చర్యలు తెలిసిందే. పాక్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ వెళ్లకుండా భారత్ లోనే ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఇటీవల తెచ్చిన చట్టం ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం
షార్ట్ టర్మ్ వీసాపై వచ్చిన వారు భారత్ నుండి వెంటనే వెళ్లకపోతే వారికి రూ.3 లక్షల జరిమానా లేదా 3 ఏళ్లపాటూ జైలుకు పంపించే అవకాశం ఉంది. ఈ రెండు శిక్షలు కూడా విధించే అవకాశం సైతం ఉంది. నిన్నటి తో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది.. పాక్ పౌరులు వెళ్లకపోతే 3ఏళ్ల జైలుశిక్ష, 3లక్షల జరిమానాదీంతో సార్క్ వీసాలపై భారత్ కు వచ్చిన వారు 26వ తేదీ తరవాత పాకిస్థాన్ తిరిగి వెళ్లకుండా పట్టబడితే వారికి శిక్ష తప్పదు. మెడికల్ వీసాలపై వచ్చిన వారికి ఈనెల 29 వరకు ఇక్కడే ఉండేందుకు అవకాశం ఉంది. ఆ తరవాత వారు కూడా వెళ్లిపోవాల్సిందే. కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పోలీసులు పాక్ పౌరులను గుర్తించి వారి దేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టారు. మూడు రోజుల్లో 509 మంది పాకిస్థాన్ పౌరులు బార్డర్ దాటి సొంత దేశానికి వెళ్లిపోయారు. అదే విధంగా 745మంది భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చారు.