Saturday, June 28, 2025

పర్మినెంట్ కేంద్రపాలిత ప్రాంతం గా కాశ్మీర్…..!

డాక్టర్. కేశవులు, చైర్మన్ : తెలంగాణ మేధావుల ఫోరం.

జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి చీలని భాగం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, స్థానిక విడిపోయే భావోద్వేగాలు, రాజకీయ అస్థిరతల మధ్య decades పాటు అల్లాడిన ఈ ప్రాంతం ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోంది. 2019 ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370ను రద్దు చేయడం, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం ఘనతపూర్వక నిర్ణయంగా పేర్కొనబడింది. అయితే నాలుగేళ్ల తరువాతనూ “కాశ్మీర్‌ను శాశ్వతంగా కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంచాలా, లేక తిరిగి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలా?” అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.

భారత రాజ్యాంగంలో రాష్ట్రాల నిర్మాణం:

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి రాష్ట్రాలను తిరిగి నిర్మించే హక్కు ఉంది. అయితే అదే రాజ్యాంగం ప్రజల అభిప్రాయాన్ని, ప్రజాస్వామ్య విలువలను, నమ్మకాన్ని గౌరవించమని సూచిస్తుంది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ఆ ప్రజల స్వయం పాలనపై కేంద్రం ఏ మేరకు ప్రభావం చూపిందన్నది ముద్దు ప్రశ్న.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు –

పైన చూపిన గణాంకాల ప్రకారం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనల సంఖ్య ద్రుతగతిలో తగ్గింది. ఇదే కేంద్ర పాలన వల్ల సాధ్యమైందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

ఆర్థికాభివృద్ధి:

ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో రూ. 56,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని కేంద్రం ప్రకటించింది.Reliance Retail, Lulu Group లాంటి సంస్థలు షోరూములు మొదలుపెట్టినట్టు ప్రకటించినా, ఇంకా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించలేదు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు నిరుద్యోగ గణాంకాలు చెబుతున్నాయి.

మద్దతు దారుల వాదనలు:

@. భద్రతా పరిస్థితులు మెరుగవుతున్నాయి.

@. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమానత్వం వచ్చింది.

@. రెజిమెంటేషన్ వలన అవినీతి తగ్గింది.

@. ఉగ్రవాదంపై నిర్దాక్షిణ్యంగా అణిచివేత జరిగింది.

వ్యతిరేక వాదనలు:

@. ప్రజల స్వయం పాలన హక్కు కాలరాయబడుతోంది.

@. స్థానిక సంస్కృతిపై దాడి అనే అభిప్రాయం పెరుగుతోంది.

@. ఎన్నికల ద్వారా వచ్చే ప్రజాప్రతినిధుల వాణి ముట్టడి చెందుతోంది.

@. కేంద్ర పాలన పేరు చెప్పి ప్రజల అభిప్రాయాన్ని పక్కన పెడుతున్నారు.

@. సాంస్కృతిక గౌరవం: స్థానిక సంస్కృతిని, మత భావజాలాన్ని గౌరవించాలి.

కాశ్మీర్‌కు ఏమి మంచిది?

#. భద్రత: ఉగ్రవాదం పూర్తిగా నశించాల్సిందే.

#. అభివృద్ధి: యువతకు ఉద్యోగాలు కల్పించే నిజమైన పెట్టుబడులు రావాలి.

#. ప్రజాస్వామ్యం: ప్రజలు తిరిగి ఓటు వేసే హక్కును పొందాలి.

#. సాంస్కృతిక గౌరవం: స్థానిక సంస్కృతిని, మత భావజాలాన్ని గౌరవించాలి.

#. ఈ నాలుగు మూల స్తంభాలపై నిలబడితేనే కాశ్మీర్ దేశానికి కలసివచ్చే రాష్ట్రంగా మారుతుంది.

ప్రస్తుతానికి భద్రతా దృష్టితో కేంద్ర పాలన కచ్చితంగా అవసరమవచ్చు. కానీ దీన్ని శాశ్వతం చేయడం కొంతవరకు ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు. తర్వాత నైనా ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడాలి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img