Wednesday, January 28, 2026

ఇది అభివృద్ధి – సంక్షేమ బడ్జెట్..తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్. కేశవులు.

తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని, వ్యవసాయం, మహిళా సంక్షేమం, యువత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం చేస్తూ ప్రాధాన్యత ఇచ్చిందని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు ఒక పత్రిక ప్రకటన పేర్కొన్నారు.


రైతు భరోసా – రూ.18 వేల కోట్లు,వ్యవసాయ శాఖకు – రూ.24,439 కోట్లు,పశుసంవర్థక శాఖకు – రూ.1,674 కోట్లు,పౌర సరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు,విద్య – రూ.23,108 కోట్లు,పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి – రూ.31,605 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమం – రూ.2,861 కోట్లు,ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు, బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు, మైనర్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు.

వ్యవసాయరంగానికి పెద్ద పీట వేస్తూ, పల్లెల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ గ్రామీణ అభివృద్ధి పథకాలు .యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు.పేద మహిళలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ఇందిరా మహిళా శక్తి మిషన్,లాంటి గొప్ప నిర్ణయాలు ఉన్నాయని డాక్టర్ కేశవులు పేర్కోన్నారు .

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img