Monday, June 30, 2025

నిజామాబాద్ జిల్లాలో హైడ్రా ! అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ మేధావుల సంఘం ఛైర్మన్ డాక్టర్ బి కేశవులు డిమాండ్.

టీ టైమ్స్ ప్రత్యేక ప్రతినిధి. నిజామాబాద్.

హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) విభాగాన్ని ప్రస్తుతానికి హెచ్ఎండీఏకే వర్తింపజేస్తున్నట్లుగానే , భారీగా కబ్జాలకు గురవుతున్న నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, పార్కులను కాపాడటానికి జిల్లాలో కూడ ” హైడ్రా ” తరహాలోనే ” నిడ్రా” ను ఏర్పరచాలని తెలంగాణ మేధావుల సంఘం ఛైర్మన్ డాక్టర్ బి కేశవులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్ నగరం లోని ఖలీల్ వాడి లో గల డాక్టర్ కేశవులు హాస్పిటల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ” జిల్లాలో చేరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలు – నిడ్రా ఏర్పాటు ” అంశంపై జరిగిన అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి కేశవులు హాజరై ప్రసంగించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ఫూలాంగ్ వాగుతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్ గల్, డిచ్ పల్లి ప్రాంతాల్లోని చెరువుల శిఖాలు, నిజాంసాగర్ కాల్వ కట్టల వద్ద కబ్జాలపై గతంలోనే ఫిర్యాదులు వచ్చినప్పటికి అధికారులు పట్టించుకోక పొవడం దారుణమని, నగర శివారులోని నిజామాబాద్- బోధన్ రహదారి పక్కనే రామర్తి చెరువు విస్తీర్ణం సుమారు 30 ఎకరాలు కాగా ప్రస్తుతం 15 ఎకరాలు కూడ లేదని, భీమ్ గల్ లో దాదాపు 73 ఎకరాల విస్తీర్ణంలోని రాథం చెరువు శిఖం ప్రాంతం 10 ఎకరాలకు మించి ఆక్రమణలను గురైందని, మొగిలి చెరువు, ధర్మారాయుడి కుంట ఆక్రమణలపై కూడ ఫిర్యాదులున్నాయని.అలాగే జిల్లాలో చెరువు శిఖాలు, కాల్వల బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతుంటే నీటిపారుదలశాఖ , మునిసిపల్, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని డాక్టర్ కేశవులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఖలీల్ వాడి లోని రోడ్లను వెడల్పు చేయండి…. కానీ….

ఖలీల్ వాడీలోని రోడ్లను మాత్రమే వెడల్పు చేయాలనడం సమంజసం కాదని, పట్టణంలోని ఇతర రోడ్లను వెడల్పు చేసినప్పుడు మాత్రమే ఖలీల్ వాడి లోని రోడ్లను వెడల్పు చేయడానికి ఎలాంటి అభ్యంతరము లేదని, ఖలీల్ వాడి లోని రోడ్ల కంటే బయట రోడ్ల వల్లనే చాలా ఇబ్బందులు ఉన్నాయని, బయట రోడ్లను వెడల్పు చేస్తున్నప్పుడు మాత్రమే ఖలీల్ వాడిలోని రోడ్లను వెడల్పు చేయాలని, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేనే కూల్చి వేయడానికి సహాయపడతానని కొందరు నాయకులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ కేశవులు సమాధానం చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా లాంటి ఏజెన్సీలను నెలకొల్పి పర్యావరణను పరిరక్షించాలని, భవిష్యత్ తరాలకు అన్యాయం చేయవద్దని అవినీతికి పాల్పడ్డ అధికారులను కఠినంగా శిక్షించాలని , వెంటనే జిల్లాలో ” నిడ్రా ” ను ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది, త్వరలోనే అఖిలపక్ష కమిటీ ఏర్పరిచి తగు కార్యాచరణ రూపొందించాలని సమావేశం నిర్ణయాలు చేసింది. పాల్గొన్న బిజేపి జిల్లా ఉపాధ్యక్షులు నాయకులు గద్దె భూమన్న, సీనియర్ జర్నలిస్ట్ నేత బొబ్బిలి నర్సయ్య,,సిపిఎం జిల్లా కార్యదర్శి రమేశ్, వెంకట్రాములు ,బి ఆర్ ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ నాయకులు మురళీ, బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు దండి వెంకట్, రిటైర్డ్ ఎంప్లాయి యూనియన్ నాయకులు రామ్ మోహన్, రైతు సంఘం నాయకులు దేవ్ రామ్,జర్నలిస్టు నాయకులు గంగదాస్, నరసయ్య, పద్మశాలి నగర అధ్యక్షుడు దాబా నర్సయ్య, ప్రజా సంఘాల నాయకులు తూటికూర నర్సయ్య, జనసేన పార్టీ నేత సంతోష్, భారతీయ సంవిధాన్ నాయకులు శ్రీనివాస్, బహుజన సామాజిక నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్, రమేష్ నాయక్, హర్షవర్ధన్ రెడ్డి, తెలంగాణ శంకర్ , అంకం జగదీష్, రుషి కుమార్, వనజ, విజయ, పాల్గొని ప్రసంగించారు

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img